విశాఖపట్నం

పోలవరం టీడీపీతోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 19: ఆంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని జీవీఎంసీ 28వ వార్డు తెలుగు మహిళలు మంగళవారం సందర్శించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఆదేశాల మేరకు, టీడీపీ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి విల్లూరి డాక్టర్ చక్రవర్తి సారధ్యంలో రెండు బస్సులో 120 మంది మహిళా కార్యకర్తలు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం పనులు పూర్తయితే ఉత్తరాంధ్ర సహా రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుందని చక్రవర్తి మహిళలకు వివరించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యాయని, ఈ ఏడాది చివర నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. అయితే శరవేగంగా జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులపై విపక్ష వైసీపీ, జనసేన పార్టీలు అబద్దాలు ప్రచారం చేస్తున్నాయన్నారు. రాష్ట్భ్రావృద్ధిని సహించలేకే విపక్షాలు పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులెదురైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇస్తారన్నారు. పోలవరం సందర్శించిన వారిలో మహిళా సమాఖ్య ప్రతినిధులు విల్లూరి తిరుమల దేవి, మంగ, గౌరమ్మ, సత్య, మాధవి, తదితరులు పాల్గొన్నారు.