విశాఖపట్నం

సమర్థపాలన అందించడంలో టిడిపి విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనందపురం, జూలై 7 : సమర్థపాలన అందించడంలో టిడిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. మండలంలోని రామవరం గ్రామంలో గురువారం జరిగిన మండల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అంతా అవినీతికి ఆలవాలంగా మారిందని విమర్శించారు. గడచిన రెండేల్ల పాలనలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అన్నారు.ప్రభుత్వ పథకాల నిర్వహణ జన్మభూమి కమిటీలకు అప్పగించి అవినీతికి ఆస్కారం కల్పిస్తున్నారని అన్నారు. పార్టీ భీమిలి ఇన్‌ఛార్జి కర్రి సీతారాం మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో అమలు చేసిన పథకాలు ఇప్పుడు కానరావడంలేదని అన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు కాకర్లపూడి వరహాలరాజు, చందక బంగారునాయుడు, బండ సత్యం, శ్రీకాంత్ రాజు, మజ్జి వెంకటరావు, లెంక రాంబాబు, పడాల రాము, ఇల్లాపు వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.