విశాఖ

మన్యంలో మావోయిస్టుల కదలికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడెంకొత్తవీధి, మార్చి 17: విశాఖ మన్యంలో మావోయిస్టుల కదలికలు నెలకొనడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల కాలంలో గిరిజన వ్యాపారిని హత్య చేసిన మావోయిస్టులు రెండు నెలలుగా ఉన్న వౌనానికి తెర దించారు. దీంతో పోలీస్ శాఖ అప్త్రమత్తమై ముమ్మర గాలింపు చర్యలను చేపట్టింది. ఇటీవల గూడెంకొత్తవీధి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా రూరల్ ఎస్పీ కోయా ప్రవీణ్ సిబ్బందికి తగు సూచనలు చేసారు. ఏ సమయంలోనైనా అప్రమత్తంగా వ్యహరించి అనుమతి లేకుండా పోలీసులను బయటకు పంప వద్దని సి. ఐ.రాంబాబు , ఎస్సై నర్సింగమూర్తులకు ఆయన సూచించారు. మవోయిస్టులు హిట్‌లిస్టులో ఉన్న వారిని అప్రమత్తం చేయాలని, సాధ్యమైనంత వరకు వారిని మైదాన ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే పలు ప్రాంతాల నుండి మావోయిస్టుల నుండి ముప్పు ఉన్న గిరిజన ప్రజాప్రతినిధులు మైదాన ప్రాంతాలకు వెళ్తున్నట్లు తెలుస్తుంది.వరుసగా జిల్లా ఎస్పీ ఏజన్సీ మండలాల్లో పర్యటిస్తూ ఆయా ప్రాంతాల్లో పోలీసులను అప్రమత్తం చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. మావోయిస్టుల కోసం భారీగా గాలింపు చర్యలను చేపడుతున్నారు. ఏ సమయంలో ఏ సంఘటన చోటు చేసుకుంటుందేమోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క అవుట్ పోస్టుల ఏర్పాటు ముమ్మరం చేస్తూనే మరో పక్క మావోల కదిలకలను పసిగట్టి మూకుమ్మడి దాడులకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు జిల్లా రూరల్ ఎస్పీ పర్యటనతో స్పష్టమవుతుంది.