విశాఖ

సిఎం పర్యటన స్థలాలు కలెక్టర్ పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్యుతాపురం, జూలై 19: ఈ నెల 23వ తేదిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పూడిమడకలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటించనున్న స్థలాలను జిల్లా కలెక్టర్ యువరాజ్ మంగళవారం పరిశీలించారు. హూదూద్ తుఫాన్‌లో నష్టపోయిన మత్స్యకారులకు పూడిమడక సమీపం వద్ద ఇన్ఫోసిస్ ఆర్థిక నిధులతో నిర్మిస్తున్న పక్కాగృహాలను ప్రారంభించడానికి సిఎం వస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ యువరాజ్ అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సభాస్థలం, శిలాఫలకం స్థలాలను పరిశీలించారు. భద్రత, బందోబస్తుపై జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మతో చర్చలు జరిపారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, ఆర్డీవో పద్మవతి, తహసీల్థార్, ప్రసాద్ శర్మ, ఎంపీడీవో శ్రీనివాసరావుతో, ఎంపీపీ చేకూరి శ్రీనివాస్‌రాజుతో పాటు పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.