విశాఖ

జగన్ తీరుకు నిరసనగా ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జూలై 19: రాష్ట్ర వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఆందోళన చేపట్టారు. జగన్ వ్యవహార శైలిని తక్షణమే మార్చుకోవాలని, అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావుపై వక్రీకరించి వార్తా కధనాలు ప్రచురించరాదంటూ జగన్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. అంతటితో ఆగని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సాక్షి దినపత్రిక ప్రతులను సైతం తగులబెట్టారు. స్థానిక శాసనసభ్యుడు క్యాంపు కార్యాలయం నుంచి ఊరేగింపుగా వచ్చిన టిడీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకు ఎదుట జగన్‌కు వ్యతిరేఖంగా నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కూన వనజ, టిడీపీ నాయకులు రమేష్, గెమ్మెలి బాబూరావు, కుమార్, సత్యానందం, ఎల్.బి. మోహన్‌రావు, బి.బి.నాగేశ్వరరావు, చట్టు అప్పలరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.