తూర్పుగోదావరి

ఉసురు తీసిన ఉత్సాహం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యుదాఘాతంతో ముగ్గురు దుర్మరణం:ఒకరికి గాయాలు
మండపేట, జనవరి 1: కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు తమ అభిమాన నటుడు ప్రిన్స్ మహేష్‌బాబు ఫ్లెక్సీని గురువారం రాత్రి తయారుజేసి నిలబెట్టేందుకు సమాయత్తమయ్యారు కొందరు యువకులు. దగ్గరలోనే విద్యుత్తు స్తంభం ఉండటంతో ప్లెక్స్ కట్టేటప్పుడు విద్యుత్తు వైర్లు ఆ ప్లెక్సీని తాకాయి. ఆ ప్లెక్స్‌లో ఐరన్ రాడ్లు ఉండటంతో ముగ్గురు యువకులు విద్యుత్తు షాక్‌కు గురయ్యారు. దాంతో మారోజు లోవప్రసాద్ (18), దబ్బా నరేష్ (20), శ్రీరంగం దుర్గా మాధవిప్రసాద్ (17)లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అందులో లోవప్రసాద్ టైలరింగ్ వృత్తిని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులను కూడా లెక్కచేయకుండా నటుడు మహేష్‌పై ఉన్న అభిమానంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్తు షాక్‌కు గురై ప్రాణాలు విడిచాడు. నూతన సంవత్సరంలో అడుగిడే సమయంలో ఆ ముగ్గుర్నీ మృత్యువు కబళించింది. మృతులకు ఇంకా వివాహం కాలేదు. వీరి మరణంతో మారేడుబాక మహిళా నగర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు రోదనలు పరిసర ప్రాంతవాసుల గుండెలను ద్రవింపజేశాయి. మృతుల తల్లిదండ్రులు, బంధువులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. శుక్రవారం టౌన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదుజేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రామచంద్రపురం తరలించారు.