విజయనగరం

‘పదోన్నతుల్లో బిసి రిజర్వేషన్ అమలు చేయాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 9: పలు ప్రభుత్వశాఖల పదోన్నతులలో బిసి రిజర్వేషన్ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ బిసి, ఓబిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోట్నూరు భాస్కరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఇక్కడ యువజన సంక్షేమ వసతి గృహంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని శాఖలలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతోపాటు పదోన్నతులలో బిసి రిజర్వేషన్ అమలు చేయాలని తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, వారిని రెగ్యులర్ చేయాలని కోరారు. జిల్లాలో బిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు యువజన సంక్షేమ వసతిగృహంలో శనివారం జిల్లాస్థాయి సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సదస్సుకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ సదస్సుకు జిల్లాలో బిసి, ఓబిసి ఉద్యోగులు పెద్దఎత్తున హాజరుకావాలని ఆయన కోరారు.