విజయనగరం

ఎమ్మెల్సీ స్థానాన్ని కైవశం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 25: రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకునే విధంగా అందరూ కృ షి చేయాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.జగదీష్ పిలుపునిచ్చారు. మంగళవారం అశోక్‌బంగ్లాలో ఏర్పాటు చేసిన టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కేడర్ ఉన్నందున పట్ట్భద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చురుగ్గా చేయాలన్నారు. జిల్లాలో దాదాపు 27 వేలమంది పట్ట్భద్రులను ఓటర్లుగా నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే మీసాల గీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు సూచనల మే రకు పార్టీ శ్రేణులు కృషి చేసి ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలన్నారు. ఈ సందర్భంగా బడుదేవరకొండ గ్రానైట్ క్వారీ గురించి పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీష్‌వద్ద ప్రస్తావించగా అక్కడ రీ-స ర్వే జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు ఆయన వివరించా రు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిరంజీవులు, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు బొద్దుల నరసింగరావు, జివి నాయుడు, ఎస్‌ఎన్‌ఎంరాజు, ముత్యాలరావు పాల్గొన్నారు.