విజయనగరం
సిగ్నల్స్ లేక నిలిచిన రైలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 5 November 2016
గజపతినగరం, నవంబర్ 4: విజయవాడ నుండి రాయగడ వెళుతున్న పాసింజరు రైలు శుక్రవారం 11.30 గంటల సమయంలో గజపతినగరం రైల్వేస్టేషన్ నుండి సిగ్నల్స్ లేకపోవడంతో స్థానిక రైల్వేగేటు మధ్యలో రైలు నిలిచిపోయింది. సుమారు 25 నిమిషాలపాటు రైలు నిలిచిపోవడంతో గేటుకు ఇరువైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిగ్నల్స్ వచ్చేంత వరకు గేటు మధ్యలోనే ఈ రైలు నిలిచిపోవడంతో వాహన చోదకులు ఇరువైపులా ప్రయాణం సాగించడానికి అవకాశం లేకుండా పోయింది. ఇటీవల ఇలా సిగ్నల్స్ లేక రైళ్లు నిలిచిపోవడం ఇది రెండోసారి. ఇకముందు ఇలా జరగకుండా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.