విజయనగరం

క్రికెటర్ల కోసం ప్రత్యేక బ్యాంకు కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), నవంబర్ 13: చింతలవలస ఎంవిజిఆర్ కళాశాల మైదానంలో కర్నాటక, రాజస్ధాన్‌ల మధ్య ఆదివారం రంజీట్రోఫీ క్రికెట్ మ్యాచ్‌ను జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల క్రికెటర్లు రద్దయిన నోట్ల నగదు మార్పిడికి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందిస్తూ భోజన విరామ సమయంలో ఒక గంటపాటు క్రికెట్ మైదానంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని లీడ్ బ్యాంకు జిల్లామేనేజర్ గురవయ్యను ఫోన్‌ద్వారా ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చింతవలస కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో గంటపాటు ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటుచేసి కర్నాటక, రాజస్థాన్ క్రికెటర్లకు సేవలు అందించామని లీడ్ బ్యాంకు జిల్లా సహాయ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం రద్దయిన నోట్ల స్థానంలో నాలుగు వేల రూపాయల వరకు చలామణిలో ఉన్న నోట్లను అందిస్తామన్నారు. అవసరమైతే సోమవారం కూడా గంటపాటు ప్రత్యేక కౌంటరను మైదానంలో ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా క్రికెట్ సంఘం పరిపాలనాధికారి త్రినాధరెడ్డి, మేనేజర్ ప్రభాకర్, కెనరాబ్యాంకు చింతలవలస మేనేజర్ మూర్తి పాల్గొన్నారు.