విజయనగరం

ప్రత్యేక హోదాపై టిడిపి నేతల్ని నిలదీయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, డిసెంబర్ 19: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులను గ్రామ గ్రామానా నిలదీయాలని వైకాపా రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై ఎస్‌జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య క్యాంపు కార్యాలయం వద్ద కొద్దిసేపు జాతీయ రహదారిపై ఆగి నాయకులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడి నాయకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన సమయంలో పేర్కొన్న విధంగా ఇవ్వడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు వంచించాయన్నారు. ప్రత్యేక హోదా విషయంలో పార్టీ వెనక్కి తగ్గేది లేదని, అవిశ్రాంత పోరాటం చేస్తామని చెప్పారు. ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో ఆ పార్టీకి బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు బూడి వెంకటరావు, మండల సురేష్, దొగ్గ దేవుడునాయుడు, బెల్లాన త్రినాథరావు, వర్రి నర్సింహమూర్తి, పల్లి సంజీవరావు పాల్గొన్నారు.

జగన్‌కు జననీరాజనం
బొండపల్లి, డిసెంబర్ 19: బొండపల్లి జాతీయ రహదారిపై ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్‌జగన్మోహన్‌రెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. సోమవారం సాయంత్రం విజయనగరం యువభేరీలో పాల్గొని బొండపల్లి మీదుగా జగన్ వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు మధ్యాహ్నం ఒంటిగంట నుండి ఎదురుచూశారు. సాయంత్రం నాలుగు గంటలకు జగన్ బొండపల్లి చేరుకోగానే ప్రజలు జగన్‌తో కరచాలనం చేసేందుకు ఉత్సాహంగా పరుగులు తీశారు. ప్రజలను చూసి జగన్ వాహనం దిగి పలకరించారు. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్యతో మాట్లాడారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు బుద్దరాజు ప్రభూజీ, చలుమూరి మూర్తి, మాజీ ఎంపిపిలు రాపాక సూర్యప్రకాశరావు, బండారు బంగారం, ఈదుబిల్లి కృష్ణ, సిరిపురపు ఆదినారాయణ, తొత్తడి సత్తిబాబు పాల్గొన్నారు.