విజయనగరం

పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షకు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, మార్చి 25: తల్లి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ పట్టణానికి చెందిన ఒక విద్యార్థిని శనివారం 10వ తరగతి పరీక్షకు హాజరైంది. తోటవీధికి చెందిన అల్లు వసంత తల్లి సింహాచలం (50) శుక్రవారం సాయంత్రం మృతిచెందింది. కొద్ది రోజుల క్రితం తల్లి సింహాచలానికి గుండె ఆపరేషన్ జరగింది. ఈ నేపథ్యంలో ఆమె మృతిచెందింది. తల్లిని కోల్పోయిన దుఖంలో కూడా గుండెనిబ్బరంతో విద్యార్థిని వసంత బౌతికశాస్త్రం పరీక్షకు హాజరైంది. తల్లిమృతదేహం ఇంటి వద్ద ఉండగానే పరీక్ష రాసేందుకు పయనమైంది. వసంత తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఈ సంఘటన పలువురిని కలిచివేసింది.