విజయనగరం

గోడ కూలి ఇద్దరు మృతి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి(రూరల్), మార్చి 22: ఉపాధి కోసం ఒక ఊరి నుంచి వేరొక ప్రాంతానికి వెళ్లిన ఇద్దరు కూలీలపై ఇంటి గోడ కూలిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన వెలుగుచూసింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం మండలం కమ్మవలస పంచాయతీ పరిధిలో ఉన్న ముత్తాయివలస గ్రామానికి చెందిన దమలపాటి శ్రీరాములనాయుడు(55), సింగారపు జగన్నాథం(45)లు మండలం కారాడ గ్రామంలో ఇంటి నిర్మాణం పనులు చేసేందుకు గురువారం వెళ్లారు. చొక్కాపు శివున్నాయుడుకు చెందిన ఇంటి పునాదాలను తవ్వుతుండగా మధ్యాహ్నం 2గంటల సమయంలో గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. అదేవిధంగా పనులు చేస్తున్న జమ్ము పరిశరాంకు దెబ్బలు తగలడంతో వెంటనే 108వాహనంలో బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. అయితే మృతిచెందిన ఇద్దరు గురువారం నుంచే కారాడ గ్రామంలో జరుగుతున్న ఇంటి నిర్మాణ పనుల్లో పాల్గొన్నారని స్థానికులు చెబుతున్నారు. నిరుపేద కుటుంబీకులు కావడంతోపాటు ఇంటికి పెద్దదిక్కులైన వీరు మృతిచెందడంతో ఏవిధంగా జీవనం సాగించాలని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. దమలపాటి శ్రీరాములనాయుడుకు భార్య పైడితల్లి, పిల్లలు రాము, నారాయణ, శ్రీదేవి, గౌరమ్మలు ఉన్నారు. అదేవిధంగా సింగారపు జగన్నాథంకు భార్య పార్వతితోపాటు పిల్లలు సాయికుమార్, గౌరీలు ఉన్నారు. ఈవిషయం తెలుసుకున్న తహశీల్దార్ ఆర్ సాయికృష్ణతోపాటు రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అదేవిధంగా గ్రామ నాయకులు వాకాడ త్రినాధరావు, ముత్తాయవలస గ్రామానికి చెందిన బొద్దల సత్యనారాయణ, శ్రీరాములనాయుడుతోపాటు గ్రామస్థులు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకుని విషాదంలో మునిగితేలారు. ఈ మేరకు పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి సిహెచ్‌సీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.