విజయనగరం

ప్రత్యేక హోదాకోసం ఉద్యమబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, మే 6: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడానికి ఉద్యమబాట పడతామని మైదాన ప్రాంత గిరిజన సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం కన్వీనర్ రఘుపతుల శశిభూషణరావు అన్నారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం చేసిన ప్రకటనకు సంఘం తరపున పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. 2014 ఎన్నికలలో నరేంద్రమోదీ, వెంకయ్యనాయుడు ఎపికి ప్రత్యేక నిధులు, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి తీరా గద్దెనెక్కిన తరువాత ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదని చెప్పి, తెలుగు ప్రజలకు అన్యాయం చేశారని విమర్శించారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తే నేడు బిజెపి ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పి తెలుగు వారికి గుండెపోటు తెప్పించిందని అన్నారు. ఎపి రెవెన్యూలోటును భర్తీ చేయాలని, అలాగే విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎపిలోని అన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయాలు పక్కనపెట్టి ఎపికి ప్రత్యేక హోదాకోసం పోరాడాలని అన్నారు. బిజెపి ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని డిమాండ్ చేశారు.