విజయనగరం

కేరళ బాధితులకు చెక్కు అందజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 17: కేరళ బాధితుల సహాయార్థం వైసీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి రూ.4 లక్షల డిడిని జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్‌కు అందజేశారు. సోమవారం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌లో ఈ చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ హితానికి వైసీపీ ముందంజంలో ఉందన్నారు. ఇటీవల వైఎస్ వర్ధంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించి డెంగ్యూ బాధితులకు ప్లేట్‌లెట్లను అందజేశామని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సొంత నిధుల నుంచి ఈ మొత్తాన్ని సేకరించామన్నారు.

22 నుంచి జిల్లాలో జగన్ పర్యటన

విజయనగరం, సెప్టెంబర్ 17: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఈనెల 22 నుంచి జిల్లాలో ప్రారంభమవుతుందని ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. సోమవారం ఆయనతోపాటు జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఎస్పీని కలసి రూట్ మ్యాప్ వివరాలను అందజేశారు. కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామం నుంచి విజయనగరం వరకు జరిగే రూట్ మ్యాప్ వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ ఇన్‌ఛార్జి బెల్లాన చంద్రశేఖర్, సీనియర్ నాయకులు పి.సాంబశివరాజు, ఎ.శ్రీరాములనాయుడు, ఎంఎల్‌ఎన్ రాజు, బి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.