విజయనగరం

సంస్కృత కళాశాలలో మాతృ దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(పూల్‌బాగ్),మే 8: పట్టణంలోని మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలో ఆదివారం మాతృవందన దినోత్సవం(మదర్స్‌డే)ను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.స్వప్నహైందవి మాట్లాడుతు మనకు జన్మనిచ్చిన అమ్మను దైవంగా భావించి పూజించాలని అన్నారు. పూర్వకాలం నుండి తల్లికి ఎంతగానో ప్రాధాన్యతను ఇచ్చారని చెప్పారు. చిన్నతనం నుండి పిల్లలకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తెలియచెప్పాలని పేర్కొన్నారు. ఈసందర్భంగా ఎస్‌బి ఐ ఉద్యోగిని సంధ్యారాణిని ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో సాహితీవేత్త ధవళ సర్వేశ్వరరావు,కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.