క్రైమ్/లీగల్

పురుగులుమందుతాగి వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, అక్టోబర్ 2: మండలంలోని జిన్నాంగ్రామంలో పురుగులు మందు సేవించి వివాహిత ఆత్మహ్యతచేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. సంఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గేదెల జ్యోతి(28) అందుబాటులోగల పురుగుల మందును సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఈ మేరకు పరిసర ప్రాంతాల వారు జ్యోతిని వైద్య చికిత్స నిమిత్తం గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందింది. జ్యోతి భర్త గురునాయుడు గ్రామంలో స్వీట్ దుకాణం నడుపుతున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జ్యోతి మృతికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.