విజయనగరం
పెరిగిన ధారగంగమ్మ హుండీ ఆదాయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 26 May 2016
శృంగవరపుకోట, మే 26: శృంగవరపుకోట ప్రజల గ్రామదేవత శ్రీధారగంగమ్మ పండగ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు వేసిన కానుకల ఆదాయం ఈ ఏడాది పెరిగింది. ఆలయ ఈ ఓ వినోదీశ్వరరావు సిబ్బంది ఆధ్వర్యంలో గురువారం ఆలయ ప్రాంగణంలో జరిగిన హుండీ లెక్కింపులో రూ.3,01,965లు లభించిందని ఈఓ తెలిపారు. 2012లో రూ. 2,40,744లు, 2014లో రూ.1,28,553 వచ్చినట్లు తెలిపారు. 600 మిల్లీ గ్రాముల బంగారం, 63 గ్రాముల వెండి హుండీలో వేసారని చెప్పారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ పర్యవేక్షకులు గోవింద, అర్చకులు రాజగోపాలాచారి, సిబ్బంది పాల్గొన్నారు.