విజయనగరం

రైతు సంక్షేమమే డెయిరీ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, జూన్ 23: రైతు సంక్షేమమే డెయిరీ ధ్యేయమని విశాఖ డెయిరీ రామభద్రపురం ప్రబంధకుడు రెడ్డి వరప్రసాద్ అన్నారు. గురువారం గజపతినగరం బిల్లింగ్ సెంటర్ పరిధిలోగల ఎం.వెంకటాపురంలో పలువురు పాడి రైతులకు ఏరువాక నగదు బదిలీ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు నగదు అవసరమయ్యే సమయంలో రైతుకు అండగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఆర్థిక సహాయం అందజేస్తున్నామని చెప్పారు. ఎం. వెంకటాపురంలో 90వేలు, కొణిసిలో 67,600, కొండపేటలో 28వేల రూపాయలు పంపిణీ చేశామని చెప్పారు. నట్టల నివారణకు మందులను అందరికీ పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు వర్రి రామకృష్ణ, ఎం. నాయుడుబాబు పాల్గొన్నారు.