విజయనగరం
జిల్లాలో 13 బిసి హాస్టళ్ల మూసివేతకు రంగం సిద్ధం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయనగరం, జూన్ 28: జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న 13 వెనకబడిన తరగతుల విద్యార్థుల హాస్టళ్లను మూసివేసేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులను సమీపంలోని ఇతర హాస్టళ్లలో చేర్చాలని యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ఈ హాస్టళ్లలో విద్యార్థులు నిర్ణీత సంఖ్యలో లేకపోవటం, కొన్ని హాస్టళ్లు ప్రైవేటు భవనాలలో నిర్వహిస్తుండగా, వాటిలో కనీస సౌకర్యాలు లోపించటం, కొన్ని హాస్టళ్లు ప్రభుత్వ భవనాలలో నిర్వహిస్తున్నా పాతబడి శిథిలావస్థకు చేరుకున్న కారణంతో 13 బిసి హాస్టళ్లను ఇతర హాస్టళ్లలో విలీనానికి జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. పూసపాటిరేగ మండలంలోని కుమిలి బిసి బాలుర హాస్టల్ను మండల కేంద్రంలోని హాస్టల్లో విలీనం చేయాలని నిర్ణయించారు. సాలూరులోని బిసి బాలుర హాస్టల్ను మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్కు అటాచ్ చేస్తున్నారు. జామిలోని బిసి బాలుర హాస్టల్ విద్యార్థులను, కల్లెపల్లి బిసి హాస్టల్ విద్యార్థులను ధర్మవరం బిసి హాస్టల్కు, బొండపల్లి బిసి బాలుర హాస్టల్ విద్యార్థులను సమీపంలోని గజపతినగరం బిసి హాస్టల్కు తరలిస్తారు. బలిజపేటలోని బిసి బాలికల హాస్టల్ను బొబ్బిలిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల హాస్టల్లో, అజ్జాడలో బిసి బాలుర హాస్టల్ను బూర్జ బిసి బాలుర హాస్టల్కు మార్చాలని నిర్ణయించారు. మక్కువ మండల కేంద్రంలోని బిసి బాలుర హాస్టల్ విద్యార్థులను బొబ్బిలి బిసి బాలుర హాస్టల్కు, వేపాడ, లక్కవరపుకోట బిసి బాలుర హాస్టళ్ల విద్యార్థులను శృంగవరపుకోట బిసి బాలుర హాస్టల్కు తరలిస్తారు. బొబ్బిలి మండలంలోని పక్కి బిసి బాలుర హాస్టల్ను అదే మండలం పిరిడిలోని బిసి బాలుర హాస్టల్కు, నెల్లిమర్ల మండలం పారసాం బిసి బాలుర హాస్టల్ను మండల కేంద్రంలోని బాలుర హాస్టల్కు మారుస్తారు. మంగళవారం జిల్లాకేంద్రంలో అధికారుల సమావేశంలో హాస్టళ్ల తరలింపునకు నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.