విజయనగరం

పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, ఆగస్టు 9: రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎపిఐఐసి చైర్మన్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి పి.కృష్ణయ్య స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో భాగంగా ప్రకాశం, బొబ్బిలి, హిందూపురంలలో ఎపిఐఐసి ఆధ్వర్యంలో గ్రోత్‌సెంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు గ్రోత్‌సెంటర్‌లో అనుకూలమైన వాతావరణం కల్పించడంతోపాటు పలురకాలైన రాయితీలు ఇస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలో తప్పనిసరిగా ఒక పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తుందన్నారు. ఇందులో భాగంగా గ్రోత్ సెంటర్‌లలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరం అనుకుంటే 3 నుంచి 400 ఎకరాలు కేటాయించేందుకు అవకాశం ఉందన్నారు. పెద్ద పరిశ్రమలకు అనుసంధానంగా చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కర్నూల్‌లో 400 ఎకరాల్లో స్టీల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే నెల్లూరులో విండ్‌పవర్ పరిశ్రమ 500 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే విశాఖపట్టణంలో ఎషియన్ పెయింట్స్‌కు సంబంధించిన పెద్ద పరిశ్రమలు ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నామన్నారు. విశాఖపట్టణం, నెల్లూరులలో రెండు ఫార్మా క్లష్టర్లు 2వేల ఎకరాల్లో ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మెట్టుపల్లిలో స్థలం పరిశీలించామని, ఆయా భూయజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు తెలిపారు. అలాగే విశాఖపట్టణంలో పెప్సీ, కోకాకోలా బాటిల్ తయారీ కంపెనీ ఒకటి ఏర్పాటుచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో వ్యాపారానికి అనువైనపరిస్థితులు ఉన్నప్పటికీ పారిశ్రామిక వేత్తలు ఆశించిన స్థాయిలో రావడం లేదన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పై దేశాల్లో ఉన్న పారిశ్రామిక వేత్తలతో తరచుగా చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. ఈయనతోపాటు గ్రోత్ సెంటర్ జెడ్‌ఎం యతిరాజు పాల్గొన్నారు.