విజయనగరం

వైద్య కళాశాల సాధన దీక్షకు మద్దతు పలకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), ఆగస్టు 11: జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాల మంజూరు చేయాలని కోరుతూ లోక్‌సత్తా పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుండి ఆదివారం ఉదయం 10గంటల వరకు చేపట్టే 24గంటల నిరాహారదీక్షకు ప్రజలు మద్దతుగా నిలవాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీశెట్టి బాబ్జీ పిలుపునిచ్చారు. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన రైతునాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులలో పేద, మధ్యతరగతి ప్రజలకు సరైన వైద్యం అందక దిక్కుతోచని స్థితిలో ఉన్న పరిస్థితుల నుండి గట్టెక్కాలంటే ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పడితేనే సాధ్యమన్నారు. వ్యవసాయం చేసే రైతాంగానికి పాము కరచినా, ప్రమాదంలో గాయపడిన, గర్భిణులు, బాలింతలకు సత్వర చికిత్స పొందడానికి విశాఖపట్నం కెజిహెచ్‌కు వెళ్లాల్సిన అగత్యం ఏర్పడిందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల జిల్లా కేంద్రంలో అందుబాటులోకి వస్తే పేద ప్రజానీకానికి మేలు జరుగుతుందని చెప్పారు. వైద్య కళాశాల మంజూరుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు లోక్‌సత్తా పార్టీ చేపడుతున్న నిరహారదీక్షకు అందరు మద్దతు పలకాలన్నారు. ఈసమావేశంలో రైతు నాయకులు అప్పారావు, సంతోష్, అప్పలసత్యం, నాగభూషణం, కాంతారావు పాల్గొన్నారు.