పశ్చిమగోదావరి
భీమవరంలో భారీ తిరంగా యాత్ర
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 18 August 2016
భీమవరం, ఆగస్టు 18: దేశభక్తి నినాదాలతో అవిశ్రాంతంగా పోరాడిన స్వాతంత్రోద్యమ చరిత్ర ప్రపంచంలోనే సువర్ణ్ధ్యాయమని ప్రముఖ న్యాయవాది తాడిమళ్ల గిరి అన్నారు. అటువంటి చరిత్రను స్మరించుకుంటూ పునఃచరిత్ర కల్పించడానికి నేటి యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో శశి స్కూల్ విద్యార్థినీ విద్యార్థులతో 360 అడుగుల జాతీయ జెండాతో పట్టణంలో గురువారం చేపట్టిన తిరంగాయాత్ర అందరినీ ఆకట్టుకుంది. పాఠశాల డైరెక్టర్ కె మురళీకృష్ణ మాట్లాడారు. అనంతరం త్యాగధనుల స్ఫూర్తితో దేశ సౌభాగ్యానికి పాటుపడతామంటూ విద్యార్థినీ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.