పశ్చిమగోదావరి
రాష్ట్ర క్రికెట్ జట్టుకు ముగ్గురు జిల్లా బాలికలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 7 September 2016
ఏలూరు, సెప్టెంబర్ 6 : పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఆంధ్రా బాలికల అండర్-19 రాష్ట్ర జట్టుకు సిహెచ్ కవిత, పి శ్రీలేఖ (దేవరపల్లి), కె హెప్సిబా (దుద్దుకూరు)లు ఎంపికయ్యారు. ఆంధ్రా అంతర్జిల్లాల రాష్ట్ర జట్టుకు జరిగిన ఎంపిక మ్యాచ్లలో కవిత 14 వికెట్లు, 160 పరుగులు, శ్రీలేఖ 22 వికెట్లు, 150 పరుగులు సాధించి ఆల్రౌండ్ ప్రతిభ కనపర్చారు. హెప్సిబా 250 పరుగులు సాధించి వికెట్ కీపింగ్లో ఆరు క్యాచ్లు, నాలుగు స్టంపింగ్లతో రాణించింది. దీంతో వీరిని ఎంపికచేశారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు రామరాజు, సభ్యులు వి విద్యాప్రసాద్, ఎం వగేష్ కుమార్, బిఎస్ మంగేష్, ఎండిఎఫ్ రహ్మాన్, కోచ్ ఎం రమాదేవి అభినందనలు తెలిపారు.