పశ్చిమగోదావరి
ఎస్సీల రిజర్వేషను 20 శాతానికి పెంచాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 26 September 2016
భీమవరం, సెప్టెంబర్ 26: రిజర్వేషన్లను ఎస్సీల జనాభా పెరుగుదలకు అనుగుణంగా 20 శాతానికి పెంచుతూ చట్టం తీసుకురావాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక యాపిల్ మిషన్ కార్యాలయంలో మాలమహానాడు జిల్లాకార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రత్నాకర్ మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో కూడా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మాలమహానాడు రాష్ట్ర సమన్వయకర్త నల్లి రాజేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా సుందర్కుమార్, జోగయ్య, పీతల సుబ్రహ్మణ్యం, నరసింహారావు, యాకోబు, చిగురుపాటి మాణిక్యాలరావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.