పశ్చిమగోదావరి

28న చంద్రన్న దళితబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 25: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, ఉప ప్రణాళికల అమలు తీరు తెన్నులపై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా చంద్రన్న దళిత బాట కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్-2 ఎంహెచ్ షరీఫ్ అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం చంద్రన్న దళిత బాట కార్యక్రమం నిర్వహణా ఏర్పాట్లను వివిధ శాఖాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ ఉదయం 10 గంటలకు ఏలూరు ఇండోర్ స్టేడియంలో చంద్రన్న దళిత బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్రానికే ఆదర్శంగా చంద్రన్న దళిత బాటను నిర్వహించాలన్నారు. గత రెండేళ్లలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి జిల్లాలో అమలుచేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రస్పుటించే విధంగా ఆయా శాఖలు పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను తాము చేస్తామని చెప్పారు. గత రెండేళ్లలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు తీరు, ఎస్సీ, ఎస్టీలకు ఆయా శాఖల ద్వారా అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలిపే బుక్‌లెట్‌ను కూడా రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా తరఫున అయిదు కోట్ల రూపాయలు, డి ఆర్‌డి ఏ తరఫున మరో 5 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు రుణాలందించడం జరుగుతుందన్నారు. అదే విధంగా జిల్లాలో 31 శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు అమలు చేసిన, చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను తెలియజేయడంతోపాటు ఆయా శాఖల ద్వారా వివిధ ఉప కరణాలు అందించడం జరుగుతుందన్నారు. ఎన్‌టిఆర్ జలసిరి, ఐటిడిఏ ద్వారా కూడా ఉపకరణాలు అందిస్తామన్నారు. ఈ నెల 27వ తేదీ సాయంత్రం నాటికే చంద్రన్న దళిత బాట కార్యక్రమం నిర్వహణా ఏర్పాట్లను ఖచ్చితంగా పూర్తి చేయాలన్నారు. 28వ తేదీ ఉదయం 9 గంటలకే సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమై, స్టాల్స్, ఎగ్జిబిషన్స్ గౌరవాతిధులు సందర్శించి లబ్ధిదారులకు వివిధ ఉపకరణాలను పంపిణీ చేస్తారన్నారు. అనంతరం గౌరవాతిధుల సందేశాలుంటాయన్నారు. కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని అదికారులకు సూచించారు. సమావేశంలో సోషల్ వెల్ఫేర్ ఉపసంచాలకులు రంగలక్ష్మీదేవి, పశుసంవర్ధక శాఖ జెడి జ్ఞానేశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి ఝాన్సీరాణి, డి ఎఫ్‌వో నాగేశ్వరరావు, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.