పశ్చిమగోదావరి

వడదెబ్బకు వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేలేరుపాడు, ఏప్రిల్ 3 : మండలంలోని యడవల్లి గ్రామానికి చెందిన ఎస్‌కె మీరాసాహెబ్ (53) అనే వ్యక్తి వడదెబ్బ కారణంగా ఆదివారం మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. చిరువ్యాపారం చేసుకుని బతికే మీరా సాహెబ్ తన వ్యాపారంలో భాగంగా ఆదివారం ఇదే మండలంలోని భూదేవిపేట గ్రామానికి వచ్చి తిరిగి ద్విచక్ర వాహనంపై యడవల్లి వెళుతుండగా తీవ్ర ఎండ కారణంగా అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన బాటసారులు అతన్ని హుటాహుటిన మండల కేంద్రమైన వేలేరుపాడు ప్రభుత్వ ఆరోగ్యకేంద్రానికి తరలించగా వైద్యం అందజేస్తున్నప్పటికీ పరిస్థితి విషమించి మృత్యువాతకు గురయ్యాడు. అకాలంగా మృతిచెందిన మీరాసాహెబ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని అక్కడికి వచ్చిన గ్రామస్తులు కోరారు.