పశ్చిమగోదావరి

తెలుగు రాష్ట్రాల్లో జనసేన ఎన్నికలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 21 : ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు జనసేన సిద్ధంగా వుందని జనసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం అగ్రహారంలోని శ్రీ భర్తియా కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకులు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బుధ, గురువారాలు ఏలూరులో సమావేశాలు ఏర్పాటు చేసి 2350 మంది ప్రతిభావంతులను గుర్తించామని చెప్పారు. జనసేన రాష్ట్ర కమిటీ ఎన్నికలకు ఇప్పటికే ప్రణాళికను రూపొందించిందని పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేయాలన్నదే పార్టీ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. మహిళలు, యువతీ యువకులు, రైతులు, విద్యార్దులు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలు అన్ని వర్గాలకు కూడా మెరుగైన పరిపాలన అందించాలన్నదే లక్ష్యమన్నారు. మానిఫెస్టో రూపొందించడం జరుగుతోందని పేర్కొన్నారు. మానిఫెస్టోలో రూపొందించిన ప్రకారం ప్రతీ ఒక్కటీ కూడా అమలు చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారని పేర్కొన్నారు. జిల్లాల వారీగా, మండలాల వారీగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలకు ఏమవసరమో అధినేత గ్రహించారని, ఆయన మనస్సులోనే అన్నీ వున్నాయని, ప్రజలు గర్వించదగ్గ విధంగా పరిపాలన సాగించాలనేదే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జి హరిప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి శంకర్‌గౌడ్, రాష్ట్ర సేవాదళ్ నాయకులు రియాజ్, ముఖ్య నాయకులు నగేష్, నారా శేషు, కొప్పిశెట్టి వీరబాబు, జల్లా హరికృష్ణ, పి సాగర్‌బాబు, శానం శ్రీరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.