పశ్చిమగోదావరి

భీమవరంలో ప్రపంచ రైల్వే వారోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 10: భీమవరంలో ప్రపంచ రైల్వే వారోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదికవి నన్నయ యూనివర్శిటీ ఎన్‌ఎస్‌ఎస్ సలహా సంఘం సభ్యులు చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో ఈ వారోత్సవాలను డివిజనల్ రైల్వే అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్‌కుమార్ మాట్లాడుతూ ఘన చరిత్ర కలిగిన భారత రైల్వేశాఖ ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఈ వారోత్సవాల ప్రజలు, రైల్వే అధికారుల మధ్య సంబంధాలు పెరుగుతాయన్నారు. దక్షిణ మధ్య రైల్వే జెడ్‌ఆర్‌యుసిసి మెంబర్లు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భీమవరం రైల్వే శాఖ సహకారంతో గత 30 సంవత్సరాలుగా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్న రంగసాయిని అభినందించారు. బిజెపి పట్టణ అధ్యక్షులు కాయిత సురేంద్ర, అక్నూ ఎన్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్ నిట్టల కిరణ్ చంద్ర, కంతేటి వెంకట్రాజు, జె శ్రీనివాస్, కుక్కల బాల వెంకటరత్నం, కౌన్సిలర్లు పంతం సతీష్, వేలూరి సుబ్రహ్మణ్యం, శివశంకర్ పాల్గొన్నారు.