పశ్చిమగోదావరి

రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 18: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తండ్రి కొడుకులను ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తండ్రి అక్కడికక్కడే మృతిచెందగా కుమారునికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కధనం ప్రకారం విజయవాడ బుడమేరు వంతెన ప్రాంతానికి చెందిన కోళ్ల అప్పారావు (60), అతని కుమారుడు శరత్‌చంద్రలు ద్విచక్రవాహనంపై ఏలూరు వచ్చి పనులు ముగించుకుని తిరిగి విజయవాడ బయలుదేరారు. వట్లూరులో రైల్వేస్టేషన్ సమీపానికి వచ్చేసరికి గుర్తు తెలియని వాహనం వెనుకనుంచి వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొనడంతో అప్పారావు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలపాలైన శరత్‌చంద్రను 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. త్రీటౌన్ ఎస్సై ఎం సాగర్‌బాబు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.