పశ్చిమగోదావరి
రైల్వే గేటు పనులు ప్రారంభించిన ఎంపీ గోకరాజు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 27 May 2018
భీమవరం, మే 27: భీమవరం ఆర్అండ్బి బైపాస్ రైల్వే గేటు పనులను నరసాపురం ఎంపీ డాక్టర్ గోకరాజు గంగరాజు ఆదివారం పూజాకార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఇప్పటివరకు ఉన్న ఆర్వోబి కింద ఉన్న రైల్వే గేటును అక్కడ నుంచి తొలగించి ఆర్అండ్బి బైపాస్ ప్రాంతంలో ఏర్పాటుచేయాల్సి ఉంది. దీనికి భీమవరం మున్సిపాల్టీ రూ.1.49 కోట్లు కూడా ఎంపీ గోకరాజు గంగరాజు సలహామేరకు చెల్లించారు. దీంతో రైల్వే శాఖ అనుమతులను జారీచేసింది. ఈ పనులపై పర్యవేక్షణ చేసిన ఎంపీ గంగరాజు అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో పూజలు చేసి ప్రారంభించారు. త్వరలోనే బైపాస్ గేటు ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు. మున్సిపల్ కమిషనర్ సిహెచ్.నాగనరసింహరావు, బిజీపి వర్మ తదితరులు పాల్గొన్నారు.