పశ్చిమగోదావరి

పార్లమెంటులో అల్లూరి విగ్రహానికి జనసేన మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాళ్ల, ఆగస్టు 13: తెలుగుజాతి గర్వపడే అల్లూరి సీతారామరాజు విగ్రహం పార్లమెంటులో పెట్టాలనే డిమాండ్‌కు జనసేన మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అణగారిన వర్గాలతో పాటు అడవిబిడ్డల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి, విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. అలాంటి విప్లవ జ్యోతిని ఒక కులానికి పరిమితం చేసి చూడలేమన్నారు. తెలుగుజాతి విప్లవ వీరుడిగా ఆయనను కీర్తిస్తామన్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా కాళ్ల మండలంలోని పెదమిరం గ్రామంలో సోమవారం నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో ఆయన క్షత్రియులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్త కులాలను రక్షించేవాడే క్షత్రియుడన్నారు. అదే క్షత్రియ ధర్మమన్నారు. క్షత్రియుల్లో కూడా పేదరికం ఉందని, వారిని కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. భీమవరంలోని డంపింగ్ యార్డు పక్కన నివసించే ప్రజల కష్టాలు వింటే తనకు బాధ వేసిందన్నారు. అక్కడి పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వడానికి అందరూ వారికి అండగా నిలవాలన్నారు. విజ్ఞత గల పెద్దలు లేకపోతే సమాజం విచ్ఛిన్నం అవుతుందని, అందుకే తాను తగ్గి మాట్లాడతానన్నారు. కొన్నిసార్లు పనులు జరగడానికి కొంతమంది పెద్దల కాళ్లు పట్టుకున్న సందర్భాలున్నాయని చెప్పారు. సమస్య వస్తే సామరస్యంగా పరిష్కరించాలని చూస్తానన్నారు. అంతేగాని కులాల మధ్య కుంపటి పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని మాత్రం చూడనన్నారు. ఏ కులంలో పుట్టినా సమాజానికి ఏం చేశామన్నదే ముఖ్యమని ఆయన చెప్పారు. క్షత్రియుల వల్లే భీమవరం అభివృద్ధి చెందిందని, మరో హైదరాబాద్‌లా భీమవరం అవుతుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. క్షత్రియ కార్పొరేషన్ కూడా జనసేన పార్టీ దృష్టిలో ఉందని ఆయన వెల్లడించారు.
సోమనాధ్ ఛటర్జీకి నివాళి
కమ్యూనిస్టు యోధుడు, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాధ్ చటర్జీ మృతికి జనసేనాధి నేత పవన్‌కళ్యాణ్ సంతాపం తెలిపారు. గొప్ప పార్లమెంటేరియన్‌గా ఆయనను కొనియాడారు. సోమనాధ్ చటర్జీ ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించిన గొప్ప వ్యక్తి అన్నారు. లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన కాలంలో సభ గౌరవాన్ని పెంచే విధంగా బాధ్యతలు నిర్వర్తించిన మహోన్నత వ్యక్తిగా పేర్కొన్నారు. పేదల, అణగారిన వర్గాల కష్టాలు తెలిపిన గొంతుగా ఆయన నిలిచారన్నారు. చటర్జీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.