పశ్చిమగోదావరి

ప్రజల కోసమే పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 8 : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు మద్దతుగా ప్రభుత్వంపై పోరాడటానికి తమ పార్టీ సిద్ధంగా వుండాలని ఈ నెల 10వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల వద్ద, కలెక్టరేట్ ప్రాంగణాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలుచేస్తున్నామని వైసిపి నాయకులు పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. ఆదివారం వైసిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ప్రభుత్వం తీరు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తాగునీరుకు, సాగునీరుకుకూడా ఇబ్బందులు ఏర్పడ్డాయని, రైతులకు పూర్తిస్థాయిలో నీరు అందించలేకపోతున్నారని అన్నారు. ప్రభుత్వ పధకాలన్నీ కూడా అర్హులకు ఇవ్వకుండా టిడిపి కార్యకర్తలకే ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన జరిగే ధర్నా కార్యక్రమాలకు అన్ని మండలాల నుంచి కార్యకర్తలు, నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తున్నామని చెబుతున్నప్పటికీ కూడా వాస్తవంగా అది ప్రజలకు చేరడం లేదని అన్నారు. ఆయన వెంట వైసిపి మహిళా నాయకురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, గుడిదేశి శ్రీనివాసరావు తదితరులున్నారు.