పశ్చిమగోదావరి

ఆర్థిక ఇబ్బందులు తాళలేక... తల్లీకూతురు ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 28: ఆర్ధిక ఇబ్బందులను తట్టుకోలేక పెదపాడు మండలం కొత్తూరుకు చెందిన తల్లికూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కుమార్తె మృత్యువాత పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తూరులో నివాసం ఉంటున్న మెరుగు వెంకటలక్ష్మి భర్త శ్రీనివాసరావు ఇటీవలే మృతిచెందారు. ఆతర్వాత ఎదురవుతున్న ఆర్ధిక ఇబ్బందులను తాళలేక వెంకటలక్ష్మి ఆమె కుమార్తె హారిక(18) సోమవారం సాయంత్రం ఇంటిలోనే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరి పరిస్ధితి గమనించిన స్దానికులు వారిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే హారిక మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తల్లి వెంకటలక్ష్మి పరిస్ధితి విషమంగా ఉండటంతో ఆమెకు వైద్యచికిత్సలను అందజేస్తున్నారు. కేసును పెదపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయ్యో.. పాము!
పెరవలి, డిసెంబర్ 28: జాతీయ రహదారిపై ఖండవల్లి వద్ద వాహనదారులు రహదారి పక్క గుమిగూడిన జనాన్ని చూసి ఏదో రోడ్డు ప్రమాదం జరిగిందని టక్కున వాహనాలకు బ్రేక్ వేసి మరీ చూస్తున్నారు. అక్కడ ఒక పెద్ద తెల్ల తాచుపాముకు నోటి వద్ద గాయమై పడగ విప్పి బుసలు కొడుతూ కదలలేక అల్లాడుతోంది. విష జంతువును చూసి భయపడే ప్రజలు పాము నోటి కింద దవడకు తగిలిన దెబ్బను చూసి చలించి పోతున్నారు. భయపడకుండా దగ్గరగా వెళ్ళి చూసి మూగజీవి పడే బాధను చూసి చలించి పోతున్నారు. జనాన్ని చూసి భయపడే పాము కూడా అలాగే ఉండిపోయింది. కొంత మంది స్థానికులు దగ్గరలోని పశువుల ఆసుపత్రికి సమాచారం అందించినప్పటికీ, వారి నుండి ఎటువంటి వైద్య సహాయం అందలేదు.