పశ్చిమగోదావరి

నేటి నుంచి జర్నలిస్టు జోగయ్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొల్లు, మే 20: ఇంతవరకు రాజకీయ, సీని రంగంలో తనదైన శైలిలో పయనించిన మాజీ ఎంపి, మాజీమంత్రి చేగొండి వెంకట హరిరామజోగయ్య పాత్రికేయుని పాత్రకు సిద్ధమయ్యారు. స్థానికంగా ఉన్న అరంభం ప్రతికను జోగయ్య పబ్లిషర్‌గా రిజిస్టర్ చేయించుకొని తొలి పత్రికను ఈనెల 21 లయన్స్ కమ్యునిటీ హాలులో ప్రారంభిస్తున్నారు. ఈ పత్రికను సీనియర్ పాత్రికేయులు ఐ వెంకట్రావు ప్రారంభిస్తారని జోగయ్య తెలిపారు. దేవాదాయ శాఖామాత్యులు పైడికొండల మాణిక్యాలరావు, ఆంధ్రమేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, ప్రభుత్వ విప్ అంగర రామమోహన్, ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు, కోస్టల్ ఇండియా డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ జివిఆర్ శాస్ర్తీ, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోత్యుల నెహ్రూ, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మేకా శేషుబాబు, మాజీ శానసభ్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు, కురసాల కన్నబాబు, ఆర్‌యస్, అల్లు వెంకట సత్యనారాయణ, డాక్టర్ బాబ్జి, బంగారు ఉషారాణి, మున్సిపల్ ఛైర్మన్ వల్లభు నారాయణమూర్తి పాల్గొంటారు.