పశ్చిమగోదావరి

టిడిపికి వందమంది కార్యకర్తల రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యలమంచిలి, జూన్ 12: ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా యలమంచిలి మండలం వైవిలంక గ్రామానికి చెందిన టిడిపి నుండి వంద మంది రాజీనామా చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు వారు స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ కాపు సోదరుల గురించి పోరాడుతున్న ముద్రగడ దీక్షను ప్రభుత్వం భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, దానికి నిరసనగానే టిడిపిని వీడుతున్నామన్నారు. ఈ మేరకు గ్రామ టిడిపి అధ్యక్షుడు గుబ్బల ఏడుకొండలును కలసి రాజీనామా పత్రాన్ని అందజేసేందుకు ప్రయత్నించగా తీసుకోవటానికి ఏడుకొండలు నిరాకరించారు. కాపుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషిచేస్తున్నదని వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. రాజీనామా పత్రం తీసుకోకపోవడంతో మండల టిడిపి అధ్యక్షుడు చిట్టూరి ఆంజనేయులుకు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు ఈ పత్రాన్ని అందజేస్తామని వారు చెప్పారు. యినుకొండ శేఖర్, శ్రీనివాస్, బొలిశెట్టి మురళి, యినుకొండ సాయికుమార్, పి బాలాజీ, ఐ అర్జునరావు, బొలిశెట్టి సుబ్రహ్మణ్యం తదితరులు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.