పశ్చిమగోదావరి

మట్టి తవ్వకాలు అడ్డుకున్న అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరవాసరం, జూన్ 17: వీరవాసరం మండలం రాయకుదురు గ్రామంలో శుక్రవారం వరిచేలల్లో మట్టిని తవ్విస్తుండగా రెవెన్యూ అధికారులు ట్రాక్టర్, జెసిబిని అదుపులోకి తీసుకున్నారు. రాయకుదురుకు చెందిన ఒక వ్యక్తి తన పంట చేలల్లోని మట్టిని తరలిస్తుండగా ఆర్‌ఐ సుధీర్, విఆర్వోలు మట్టి ట్రాక్టర్లను నిలుపుదల చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన సీనరైజేషన్ చెల్లించాలని రైతులకు తెలిపారు. అయితే తన చేలోని మట్టిని తన ఇంటి అవసరాల కోసం తరలిస్తున్నానని, అందుకు సంబంధించిన పత్రాలన్నీ ఉన్నాయని రైతు ఆర్‌ఐకు తెలిపారు. దీనిపై ఆర్‌ఐ సుధీర్ మాట్లాడుతూ మీవద్ద ఉన్న పత్రాలు తీసుకువచ్చి తహసీల్దార్‌కు చూపించాలని పేర్కొన్నారు. తన పత్రాలు తహసీల్దార్‌కు చూపిస్తానన్నాడు. పత్రాలు చూపించేంత వరకు మట్టిని తవ్వరాదని, అలాగే మట్టిని తవ్వుతున్న జెసిబి, ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.