వరంగల్

రాష్ట్ర స్థాయి చెపక్‌తక్రలో గురుకుల విద్యార్థులకు బంగారు పతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగాల, అక్టోబర్ 20: స్కూల్ గేమ్స్ పెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన 63వ రాష్ట్ర స్థాయి చెపక్‌తక్ర అండర్ 14 విభాగంలో స్థానిక గురుకుల పాఠశాల విద్యార్థులు బంగారు పతకం, అండర్ 17లో తృతీయ స్థానం పొంది కాంస్య పతకం సాథించినట్లు ప్రిన్సిపాల్ నాగబూషణం, భాస్కర్ గౌడ్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 18న హైద్రాబాద్ ఎల్‌బి నగర్ లోని హైస్కూల్ క్రీడ మైదానంలో జరిగిన రాష్ట్ర స్థాయి చెపక్‌తక్ర పోటీలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి అండర్ 14లో వాసుకుమార్ ,అనిల్ , సాయి కుమార్ పాల్గొని ప్రతిభ కనబరుచుతూ బంగారు పతకాలు సాధించినారు. అండర్ 17లో మహేష్, హుస్సేన్, సిద్ధార్థలు రాణించి కాంస్య పథకాలు సాధించినట్లు వారు తెలిపారు. ఈ పోటీల్లో వాసుకుమార్, అనిల్, మహేష్‌లు తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపిక కాగా, వీరు జాతీయ స్థాయి పోటీలలో ఆడనున్నాట్లు వారు తెలిపారు. స్కూల్ గేమ్స్ పెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గౌడ్ ,హన్మంతు, మేనేజర్ బాలరాజు, పిఇటి రఘు, వెంకటేశ్వర్లు ,శ్రీనివాసులు, దామోదర్ గౌడ్‌లు హర్షం వ్యక్తం చేశాయి.