వరంగల్

వైభవంగా సీతారామ కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేగొండ, ఏప్రిల్ 15: మండలంలోని రూపిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన సీతారామ కల్యాణ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి మధుసూదనాచారి కుటుంబ సమేతంగా హాజరై స్వాముల వారికి పట్టువస్త్రాలు అందచేశారు. మంగళసూత్రాలు, తలంబ్రాలు సమర్పించి కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. రావులపల్లిలో సీతారామ కల్యాణ వేడుకలకు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలో సుల్తాన్‌పూర్, రంగయ్యపల్లి, నిజాంపల్లి, గూడెపల్లి గ్రామాల్లో కూడా రాముల వారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. సీతారాముల వారి కల్యాణంను పురస్కరించుకొని ఆలయాల్లో నిర్వహకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కడారి నవనీతరావు, టిఆర్‌ఎస్ రాష్ట్ర యూత్ నాయకులు సిరికొండ ప్రదీప్, సిరికొండ క్రాంతికుమార్, ఎంపిపి ఈర్ల సదానందం, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు మోడెం ఉమేష్‌గౌడ్, నాయకులు రాజేశ్వర్‌రావు, రవి, మైస బిక్షపతి, బాబురావు, అశోక్, రఘు తదితరులు పాల్గొన్నారు. సీతారామ కల్యాణ వేడుకల్లో టిడిపి జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు పాల్గొన్ని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.