క్రైమ్/లీగల్

మద్యం మత్తులో తండ్రి హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్ధన్నపేట, ఏప్రిల్ 5: క్షణికావేశంలో మద్యం మత్తులో కన్న తండ్రిని హతమార్చిన కొడుకు ఉదంతం గురువారం రాత్రి వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని కడారిగూడెంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు మంద అయిలయ్య (58) వేసవి కాలం కావడంతో తన ఇంటి ముందు నిద్రిస్తుండగా చిన్న కుమారుడు దేవేందర్ బండరాయితో తలపై మోదడంతో తండ్రి అయిలయ్య అక్కడిక్కడే మృతిచెందాడు. రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఇంట్లో భోజనం చేస్తుండగానే దేవేందర్ తప్ప తాగి ఈదారుణానికి ఒడిగట్టాడు. అయిలయ్య తన గ్రామంలో చిన్న డబ్బాలో కూరగాయలు అమ్ముకుంటూ రెండు ఎకరాల స్వంత భూమిలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. గత కొంత కాలంగా చిన్న కుమారుడు దేవేందర్ తాగుడుకు బానిసై తన వ్యవసాయ భూమిని పంచి ఇవ్వాలని తరచుగా తండ్రితో గొడవపడుతున్నాడు. తాను ఇస్తే భూమిని అమ్మేస్తాడని భావించి తండ్రి తన ఆస్తిని దేవేందర్ పిల్లలకు ఇస్తానని చెబుతూ వస్తున్నాడని, దాంతో కక్ష్య పెంచుకుని మద్యం మత్తులో చంపివేశాడని కుటుంబ సభ్యులు రోధిస్తూ తెలిపారు. వర్ధన్నపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నారు.