వరంగల్

రక్తదాతలు నిజమైన ప్రాణదాతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటారం, జూన్ 23: రక్తదానం చేసిన దాతలు నిజమైన ప్రాణదాతలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెవెన్యూ అధికారి మోహన్‌లాల్ అభివర్ణించా రు. శనివారం కాటారం మండల కేంద్రమైన గారెపల్లిలో అయ్యప్ప ఫంక్షన్ హాల్‌లో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిభిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మోహన్‌లాల్ మాట్లాడుతూ ఐఏఎస్ అధికారి పి నరహారి ఏర్పాటుచేసిన ఆలయ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న సామాజిక కార్యక్రమాలు అమోఘమని అన్నారు. ఈ శిబిరంలో సఖ్యత స్వచ్చంద సంస్థ అధ్యక్షురాలు సూర్యదేవర వనిత, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీమల సందీప్, కాళేశ్వరం సంజీవని యూత్ అధ్యక్షుడు కీర్తి శ్రావణ్ కుమార్‌ల ఆధ్వర్యంలో వారి సభ్యులు, స్వచ్చంధ సభ్యులు రక్త దానం చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం సీఐ చింతల శంకర్‌రెడ్డి ఆలయ ఫౌండేషన్ నిర్వాహకులు గొడిసెల లక్ష్మణ్, జక్కు రాకేష్, అయిత శివకుమార్, టీట్ల రమేష్‌బాబు, మల్క రామస్వామి, పరికిపండ్ల రాము, డాక్టర్ వినయ్, సిబ్బంది పాల్గొన్నారు.