వరంగల్

పంచాయితీ ఎన్నికలకు కఠిన నిబంధనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్,జనవరి 4: పంచాయితీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు గతంలో లాగా తూతూ మంత్రంగా వివరాలు వెల్లడిస్తే మొదటికే మోసం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పంచాయితీ ఎన్నికల సంఘం కఠిన నిబందనలను ఈసారి విదించింది. సర్పంచ్, వార్డు సుభ్యులుగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు విధిగా అఫిడవిట్ సమర్పించాల్సిన పరిస్థితి ఉంది. తప్పుడు సమాచారంతో నామినేషన్ దాఖలు చేస్తే అప్పుడే తిరస్కరించడంతోపాటు ఒకవేళ గెలిచిన సర్పంచ్ తప్పుడు వివరాలు ఇచ్చాడని తెలిస్తే అనర్హుడుగా ప్రకటించే అవకాశం నామినేషన్ సందర్భంలో సమర్పించే అఫిడవిట్‌తో ఏర్పడనుంది. దీంతో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీచేయాలనే భావించే అభ్యర్థులు నిబందనలపైన అవగాహన పెంచుకునే పనిలో పడ్డారు. నూతన పంచాయితీరాజ్ చట్టం 2018 ప్రకారం అనేక కొత్త అంశాలను పొందుపర్చడం జరిగింది. ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే అభ్యర్ధి తన ఆస్తులతోపాటు ఉమ్మడి కుటుంబ ఆస్తులను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. పోలీస్ కేసులు, కోర్టు కేసులు, శిక్షలు ఇలా ప్రతి అంశాన్ని ఏదీ రహస్యంగా దాచుకోకుండా వివరించాల్సిన పరిస్థితి కొత్త చట్టంలో ఎర్పడింది. దాఖలు చేసే పత్రాలపై అభ్యర్ధి సంతకంతో పాటు మరో ఇద్దరు సాక్షులతో సంతకం చేయించి డిక్లరేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందించాలి. దీంతో ప్రస్తుతం పల్లెల్లో ఎన్నికల నిబందనలపై చర్చ ముమ్మరంగా సాగుతుంది. ఇక ఆస్తుల వివరాలకు వస్తే జీవిత భాగస్వామితోపాటు పిల్లల ఆస్తులను కూడా సమర్పించాలి. కుటుంబ సభ్యుల పాన్‌కార్డు, అకౌంట్‌నెంబర్, ఆదాయపన్నుశాఖ ఇచ్చిన రిటర్న్స్, ఉమ్మడి కుటుంబం అయితే అక్కడ వచ్చే ఆస్తుల వాటా కూడా తెలుపాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే చేతిలో ఉన్న నగదు నుండి బ్యాంకులో ఉన్న డబ్బుదాకా ప్రతి అంశం అఫిడవిట్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. అంతేగాకుండా అభ్యర్ధి విద్యార్హతను కూడా ఈసారి తప్పనిసరిగా తెలుపాల్సి ఉంది. చదువుకున్న చదువు వివరాలతోపాటు అందుకు సంబందించిన దృవీకరణ పత్రాలు సమర్పించాలి. అభ్యర్ధి సమర్పించిన అఫిడవిట్‌ను ఎన్నికల అధికారి కార్యాలయంలో నోటిస్ బోర్డుకు అతికిస్తారు. ఆ పత్రాల్లో ఎమైన తప్పులు ఉంటే అప్పటికప్పుడే అభ్యర్ధి పైన పిర్యాదు చేసే అవకాశం ఉంది. తనపై వచ్చిన పిర్యాదులను నిజం కాదని రుజువు చేసుకోనట్లైతే నామినేషన్‌ను తిరస్కరించే అంత కఠినంగా ఎన్నికల చట్టాలను రూపోందించారు. పల్లెపోరును పారదర్శకంగా పటిష్టంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో నిబందనలను అత్యంత కఠినతరం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పోటీలో దిగే ఆశావాహులు ప్రస్తుతం నిబందనలపై అవగాహన పెంచుకునే పనిలో న్యాయవాదుల చుట్టూ తిరుగుతున్నారు.

కన్నుల పండువగా లక్ష లక్ష్మీ కుంకుమార్చన

మహబూబాబాద్,జనవరి 4: ధనుర్మాసోత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని గార్ల శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో శుక్రవారం గోదాదేవి అమ్మవారికి మహిళలు లక్ష లక్ష్మీ కుంకుమార్చనను కన్నుల పండువగా నిర్వహించారు. ధనుర్మాసోత్సవాల్లో ఒక శుక్రవారం కుంకుమార్చన నిర్వహించటం ఆనవాయితీ. అలంకృతులైన గోదాదేవి అమ్మవారికి పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకం చేసి పట్టు వస్త్రాలు, వివిధ రకాల పూలతో అలంకరింపజేసి మంగళవాయిద్యాల మధ్య అలయ మండపంలో ప్రతిష్టింపజేసి గోదా అష్టోత్తర లక్ష లక్ష్మీ కుంకుమార్చన పూజలు చేశారు. ఈ సందర్భంగా అలయ వంశపారంపర్య అర్చకులు కాండూరి లక్ష్మీనారాయణ చార్యులు వేద మంత్రాలు వల్లించారు. ఈ కార్యక్రమంలో మాటేటి పద్మ, పుల్లఖండం కవిత, వేంశెట్టి కవిత, గంగావత్ శారద, ఎద్దు కరుణ, పుల్లఖండం పార్వతి, కొణతం సుభద్ర, కానాల మంగమ్మ, వడ్లమూడి లక్ష్మీ, మాలోతు మాణిక్యమ్మ, మూడు భారతి, పబ్బిశెట్టి తరంగిణీ తదితరులు పాల్గొన్నారు.