వరంగల్

అల్లుడు చేతిలో అత్త హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం,మే 23: మండలకేంద్రంలోని నేతకాని వాడకు చెందిన కందగట్ల వెంకటమ్మ (55) జిల్లా కేంద్రంలోని ఎంజిఎంలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మండలకేంద్రానికి చెందిన కందగట్ల సత్యనారాయణ - వెంకటమ్మ దంపతుల కుమార్తె మంజులారాణిని, ములుగు మండలం లాలయ్యగూడెంకు చెందిన సల్లూరి రామకృష్ణకిచ్చి గత రెండేళ్ళ క్రితం వివాహం చేశారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్న క్రమంలో ఇటీవల మంజులారాణి తల్లిదండ్రుల వద్దకు చేరింది. ఈ క్రమంలో భార్యను తీసుకువెళ్ళేందుకు ఏటూరునాగారం వచ్చిన రామకృష్ణ ఈనెల 19వ తేదీ రాత్రి అత్త వెంకటమ్మతో గొడవపడుతూ ఆవేశానికి గురై కర్రతో తలపై కొట్టడంతో తీవ్రగాయం కాగా ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స అందించి పరిస్ధితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్రంలోని ఎంజిఎంకు తరలించారు. గత నాలుగు రోజులుగా ఎంజిఎంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందిందని తెలిపారు. కాగా, భర్త సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోతె నరేష్ తెలిపారు.