వరంగల్

తీజ్ సంబురాల్లో డిప్యూటీ స్పీకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, ఆగస్టు 11: లంబాడీ యువతులు జరుపుకొనే తీజ్ వేడుకల్లో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ శాఖా మంత్రి జోగు రామన్నలు పాల్గొన్నారు. నర్సంపేటలోని ప్రజ్ఞ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం లంబాడా యువతులు తీజ్ ఉత్సవాలను వారి కులపెద్ద అయిన డాక్టర్ ఉదయ్‌సింగ్, ఉష దంపతుల ఆధ్వర్యంలో జరుపుకొన్నారు. పెళ్లి కాని యువతులు శ్రావణ మాసంలో తీజ్ పండుగను జరుపుకొంటారు. ఆయురారోగ్యాలతో.. పాడిపంటలతో.. సుఖ సంతోషాలతో.. సౌభాగ్యాలతో సమాజం వికసించాలని తీజ్ వేడుకలను గిరిజనులు ప్రతి ఏడాది శ్రావణ మాసంలో జరుపుకొంటారని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి చెప్పారు. ఈ వేడుకల్లో టిఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నాయకులు కామగోని శ్రీనివాస్‌గౌడ్, తీజ్ ఉత్సవ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు భూక్య జగన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.