వరంగల్

అటు తండ్రి మృతి.. ఇటు టెన్త్ పరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్థన్నపేట, మార్చి 21: పదో తరగతి పరీక్ష ప్రారంభం రోజునే తండ్రి గుడికందుల దేవెందర్ (40) మృతి చెందడంతో తీవ్ర దుఃఖంతో పరీక్ష రాసిన విద్యార్థి ఉదంతం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో సోమవారం జరిగింది. దేవెందర్ మండల కేంద్రానికి సమీపంలోని కట్య్రాల పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్నాడు. పెట్రోల్‌బంక్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో పక్షవాతం రావడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు తోటి సిబ్బంది హుటాహుటిన వరంగల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ యజమాని ఆకస్మికంగా మరణించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగి పోయారు. మృతునికి ముగ్గురు కుమార్తెలే ఉండడంతో పెద్దకుమార్తె నవ్య తండ్రికి తల కొరివి పెట్టాల్సి వచ్చింది. రెండవ కుమార్తె పదో తరగతి పరీక్ష రాసి దహన కార్యక్రమాలకు హాజరైంది. స్థానిక జడ్పీటీసి పాలకుర్తి సారంగపాణి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ నిరుపేద కుంటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.