వరంగల్
రైలురోకో కేసులో కోర్టుకు హాజరైన స్పీకర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 6 December 2016
వరంగల్, డిసెంబర్ 5: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకోసం జరిగిన ఉద్యమం సందర్భంగా రైలురోకోలో పాల్గొన్న కేసులో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సోమవారం జరిగిన విచారణకు హాజరయ్యారు. 2012లో తెలంగాణ ఉద్యమ తీవ్రంగా కొనసాగుతున్న సందర్భంలో జరిగిన రైలురోకో కార్యక్రమంలో మధుసూదనాచారితోపాటు పలువురిపై అప్పట్లో రైల్వేపోలీసులు కేసు నమోదు చేసారు. సోమవారం కేసు విచారణకు రాగా స్పీకర్ కాజీపేటలోని రైల్వేకోర్టుకు హాజరయ్యారు. కేసును పరిశీలించిన రైల్వే కోర్టు మెజిస్ట్రేట్ కేసును జనవరి 12కు వాయిదా వేసారు. కాగా మరో రైల్రోకోకు సంబంధించిన కేసులో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్రెడ్డి విచారణ కోసం సోమవారం రైల్వే మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు.