ఆంధ్రప్రదేశ్‌

పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: అప్పుల విషయమై భర్తతో గొడవ జరిగాక తీవ్ర మనస్తాపానికి లోనైన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకుంది. బుక్కరాయ సముద్రం మండలం కొట్టాలపల్లిలో సోమవారం ఈ దారుణం వెలుగు చూసింది. అప్పుల విషయమై ఆదివారం సాయంత్రం ఆనందరెడ్డి, భారతి దంపతుల మధ్య గొడవ జరిగింది. స్థానిక పెద్దలు రాజీ కుదిర్చాక ఇంట్లోకి వెళ్లేందుకు భారతి అంగీకరించింది. అయితే, సోమవారం ఉదయం చూసేసరికి భారతి, ఆమె ఇద్దరు కూతుళ్లు విగతజీవులుగా కనిపించారు. పిల్లలకు విషమిచ్చి ఆమె ఉరివేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు.