అంతర్జాతీయం

భారత్‌కు బిలియన్‌ డాలర్ల రుణం: ప్రపంచబ్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: సౌరశక్తి వినియోగాన్ని భారత్‌లో వ్యాప్తి చేసేందుకు ప్రపంచబ్యాంకు రికార్డు స్థాయిలో బిలియన్‌ డాలర్ల డబ్బు రుణం ఇవ్వడానికి అంగీకరించింది. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌ యాంగ్‌ కిమ్‌తో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి, సౌర శక్తి వినియోగం పెంచే అంశంపై మోదీకి ఉన్న వ్యక్తిగత నిబద్ధత తమను భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించిందని జిమ్‌ యాంగ్‌ మోదీతో సమావేశం అనంతరం ఓ ప్రకటనలో వెల్లడించారు.