రంగారెడ్డి

వైకాపా బలోపేతానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మార్చి 12: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు బలోపేతం చేయాలని రంగారెడ్డి జిల్లా వైసిపి అధ్యక్షుడు సురేశ్‌రెడ్డి సూచించారు. శనివారం సుభాష్‌నగర్ డివిజన్ కృషికాలనీ వైసిపి కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 6వ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.
స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించిన సురేశ్‌రెడ్డి కేక్‌ను కట్‌చేశారు. స్వర్గీయ వైఎస్‌ఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఎన్నటికీ మరువలేరని అన్నారు. కార్యక్రమంలో నాయకులు రాము, వెంకట్‌రెడ్డి, సునిత, చంద్రకళ, మెహరాజ్, శివాజీ, శివాగౌడ్, భరత్, సుజిత్, ఫారూక్ పాల్గొన్నారు.