రాష్ట్రీయం

వైకాపా అభివృద్ధి నిరోధక పార్టీ: టిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని వైకాపా వ్యతిరేకిస్తోందని, ఇది ఐదు కోట్ల ఆంధ్రులను అవమానపరిచినట్లేనని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. మంగళవారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం రాజధాని నిర్మాణంతో పాటు అన్ని సంక్షేమ విధానాలపై తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందుంచుతోందని, పారదర్శక విధానాలను అమలు చేస్తోందన్నారు. రాజధానికి రైతులు భూములు ఇవ్వకుండా రెచ్చగొట్టే ధోరణిని అవలంభించడం వైకాపాకు తగదన్నారు. ప్రభుత్వ నిధులు దుబారా చేయవద్దని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందన్నారు. వైకాపా అభివృద్ధి వ్యతిరేక పార్టీ అని ప్రజలు నిర్ణయించారని, అందుకే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించారన్నారు. విజయవాడను క్రైం సిటీ అని అంబాండాలు వేయడం తగదన్నారు.